15 ఏండ్లకు తెరుచుకున్న బడి.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్మండలం డబ్బకుచ్చి స్కూల్రీ ఓపెనింగ్

15 ఏండ్లకు తెరుచుకున్న బడి.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్మండలం డబ్బకుచ్చి స్కూల్రీ ఓపెనింగ్

ఆదిలాబాద్, వెలుగు: 15 ఏండ్ల కింద విద్యార్థులు లేక మూతపడిన పాఠశాల మంగళవారం తెరుచుకుంది. 34 మంది విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకున్నారు. ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్ మండలం డబ్బకుచ్చి మండల పరిషత్​ ప్రైమరీ స్కూల్ 15 ఏండ్ల కింద విద్యార్థులు లేరనే కారణంతో మూతపడింది. అప్పటి నుంచి గ్రామానికి చెందిన విద్యార్థులు పక్క గ్రామానికి వెళ్లి చదువుకునేవారు. లేదంటే చదువు మానేసేవారు.

ఈ క్రమంలో యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అధ్యక్ష, కార్యదర్శలు ఆత్రం నగేశ్, షేక్  అల్తాఫ్  సోమవారం గ్రీవెన్స్ లో కలెక్టర్​ రాజర్షిషాకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్  బడి తెరిపించాలని ఆదేశించారు. మంగళవారం విద్యా శాఖ సెక్టోరియల్  అధికారులు సుజత్  ఖాన్, తిరుపతి, శ్రీకాంత్  గౌడ్​ మూతబడిన పాఠశాలను పున: ప్రారంభించారు. బడిలో రెగ్యులర్  ఉపాధ్యాయులను నియమించాలని, సౌలతులు కల్పించాలని విద్యార్థి సంఘం నాయకులు, పేరెంట్స్​ కోరారు.