స్కూటీపై వెళుతూ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

స్కూటీపై వెళుతూ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

సంగారెడ్డి జిల్లా: నారాయణఖేడ్ పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్కూటీ పై వెళుతున్న ఉపాధ్యాయుడు గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. కంగ్తి మండలం దామరగిద్దలో పనిచేస్తున్న తెలుగు పండితులు ధూప్య నాయక్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. 

వాహనం నడుపుతున్న సమయంలో అస్వస్థతకు గురైన ధూప్య నాయక్ స్కూటీనీ రోడ్డు పక్కకు తిప్పే ప్రయత్నంలోనే నియంత్రణ కోల్పోయాడు. దీంతో స్కూటీతో సహా కిందపడ్డారు. పాదచారులు వెంటనే వచ్చి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. తుదిశ్వాస విడిచారు. ధూప్య నాయక్ స్కూటీ నడుపుతూ గుండెపోటుతో కుప్పకూలిన ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది. స్థానికులు వీడియోను షేర్ చేయడంతో ఈ ఘటన వైరల్ అయింది.