గత ప్రభుత్వం సమస్యలు చెప్పుకునే అవకాశమే ఇవ్వలే

 గత ప్రభుత్వం సమస్యలు  చెప్పుకునే అవకాశమే ఇవ్వలే
  • ప్రజా ప్రభుత్వం అడగ్గానే టీచర్లకు పదోన్నతులు కల్పించింది
  • సీఎంకు థాంక్స్​ చెప్పిన ఎస్​టీఎఫ్​

బషీర్​బాగ్, వెలుగు: బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో కనీసం సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఉండేది కాదని, పోలీసులతో ఉద్యోగ, ఉపాధ్యాయులను భయపెట్టేవారని స్కూల్​ టీచర్స్​ ఫెడరేషన్(ఎస్​టీఎఫ్) అధ్యక్షుడు దేవరకొండ సైదులు అన్నారు. ఇప్పటి ప్రజాప్రభుత్వంలో నేరుగా సమస్యలు చెప్పుకునే అవకాశం కలుగుతోందన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​ హయాంలో అన్ని వర్గాల  సమస్యలు త్వరగా పరిష్కారమవుతున్నాయన్నారు. 

ఎంతో కాలంగా పెండింగ్​లో ఉన్న టీచర్ల ప్రమోషన్లను రేవంత్​ సర్కార్​ నెరవేర్చడంపై సంతోషం వ్యక్తం చేశారు. నగదు రహిత వైద్య పథకానికి సంబంధించిన చర్యలను కూడా చేపట్టాలని కోరారు. రిటైర్డ్​ ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ ను వెంటనే అందించాలన్నారు. సీపీఎస్​ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. టీచర్లకు పదోన్నతులు కల్పించడంపై సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు థాంక్స్​ చెప్పారు.