నిజామాబాద్, వెలుగు: టీచర్ల లాంగ్ లీవ్స్, డిప్యుటేషన్లతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాఠశాల విద్య కుంటుపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్స్కూళ్లలో ఇంగ్లీష్మీడియం బోధన ప్రవేశపెట్టి విద్యా ప్రమాణాలను పెంచుతామని చెప్తున్నప్పటికీ, బోధించే వారు లేక ఆశించిన ఫలితాలు రావడం లేదు. చాలా స్కూళ్లలో టీచర్లు లేక డ్రాపవుట్ల సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో 83 మంది టీచర్లు లాంగ్లీవ్లో ఉండగా.. ఆయా స్కూళ్లలో ఉన్నవారు కొందరు పైరవీలు చేసుకుని డిప్యుటేషన్పై వెళ్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఇంగ్లీష్ మీడియం బోధనపై ఎఫెక్ట్..
2021 - 22 అకడమిక్ ఇయర్ నుంచి గవర్నమెంట్స్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెట్టడంతో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. కానీ ఆ స్థాయిలో టీచర్లు లేక విద్యాభ్యాసం కుంటుపడుతోంది. లాంగ్లీవ్స్ తో పాటు రాజకీయ వత్తిళ్లు, విద్యాశాఖ అధికారులు టీచర్లను డిప్యుటేషన్లపై పంపుతూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో చాలా మంది స్టూడెంట్లు డ్రాపవుట్లుగా మారుతున్నారు. ఆయా గ్రామాళ్లో పనిచేస్తున్న డిప్యుటేషన్టీచర్లను వెనక్కి పంపాలని సర్పంచ్ లు ఎంఈవోలకు వినతిపత్రాలు ఇస్తున్నారు.
83 మంది టీచర్లపై కంప్లైంట్స్
నిజామాబాద్ జిల్లాలో 1,156 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 5,500 మంది టీచర్లు ఉన్నారు. పలు స్కూళ్లలో డిప్యుటేషన్లపై 15 శాతం టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 83 మంది టీచర్లు లాంగ్లీవ్ పెట్టి విదేశాలకు వెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న టీచర్లపై జిల్లా విద్యాశాఖకు ఇప్పటికే పలు మార్లు కంప్లైంట్స్ వెళ్లాయి. కొందరు టీచర్లు బెంగళూరు, హైదరాబాద్లోని సాప్ట్వేర్ కంపెనీల్లో పని చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
అధికారుల నిర్లక్ష్యం
టీచర్లు దీర్ఘకాలిక సెలవులపై విదేశాల్లో పనిచేస్తున్నారు. ఈ విషయంపై కంప్లైంట్లు ఉన్నా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొవిడ్ కారణంగా అతలాకుతలమైన ప్రైవేట్, కార్పొరేట్స్కూళ్ల మేనేజ్మెంట్లు స్టూడెంట్ల సంఖ్యను పెంచుకునేందుకు తక్కువ ఫీజుల పేరుతో ప్రభుత్వ స్కూళ్ల స్టూడెంట్లను తీసుకెళ్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
డిప్యుటేషన్లతో సమస్యలు..
నిజామాబాద్ జిల్లాలో రోడ్డు పక్కనే ఉన్న స్కూళ్లకు డిప్యుటేషన్ హడావుడి నెలకొంది. బోర్గం (పి) వంటి స్కూల్కు డిప్యుటేషన్పై వస్తున్న టీచర్లతో మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లు మూతపడాల్సి వస్తోంది. నవీపేట్ బాలుర పాఠశాలకు చెందిన ఇద్దరు టీచర్లు రోడ్డు పక్కనే ఉన్న డిప్యుటేషన్పై వెళ్లారు. దీనితో, తిరిగి పిలవడానికి ఇంగ్లీష్ బయాలజీ టీచర్లు లేరు. దర్పల్లికి చెందిన ఓ టీచర్బోర్గాంకు డిప్యుటేషన్పై వచ్చారు.
కామారెడ్డి జిల్లాలో..
జుక్కల్ మండలం నాగల్ గావ్ అప్పర్ప్రైమరీ స్కూల్లో 143 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూల్లో 8 మంది టీచర్ల అవసరం ఉండగా.. 6 మంది తోనే నెట్టుకొస్తున్నారు. ఇటీవల తెలుగు పండిట్ అబ్దుల్ రెహమాన్ లాంగ్ లీవ్ పెట్టి లండన్ వెళ్లారు. రెహమాన్ విదేశాలకు వెళ్లేందుకు ఆర్జేడీ పర్మిషన్కూడా ఇచ్చిందని హెడ్ మాస్టర్ తెలిపారు. మరో టీచర్అర్చనను మండల ఎంఈవో కౌలాస్ స్కూల్కు డిప్యుటేషన్పై పంపారు. ప్రస్తుతం ఈ స్కూల్నలుగురు టీచర్లతోనే నడుస్తోంది. జుక్కల్ మండలంలోని పెద్దగుళ్ల స్కూల్ టీచర్ తరుణ లాంగ్లీవ్పై వెళ్తున్నారు. మహ్మదాబాద్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నవీన్కుమార్ను డిప్యుటేషన్ పై పెద్దగుళ్ స్కూల్కు పంపారు. ఇలా పెద్దకొడప్గల్, పిట్లం, నిజాం సాగర్ మండల ఎంఈవోలు డిప్యుటేషన్ఆర్డర్స్ ఇవ్వడంతో స్కూళ్లలో ఇబ్బంది ఎదురవుతోంది.
లాంగ్ లీవ్స్ రద్దు చేయాలి
లాంగ్ లీవ్ లో ఉన్న టీచర్ల లీవ్ లను రద్దు చేయాలి. డిప్యూటేషన్పై ఉండి దీర్ఘకాలంగా కొనసాగుతున్న టీచర్లను బదిలీపై రప్పించాలి. టీచర్ల కొరత వల్ల చదువు సాగడంలేదు. 83 మంది టీచర్లు దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులు టీచర్లు లేక నష్టపోతున్రు.
- భానుచందర్, తెలంగాణ విద్యార్థి పరిషత్ ప్రతినిధి
రద్దు చేసేందుకు చర్యలు
లాంగ్లీవ్స్రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ సెలవుల వల్ల టీచర్ల షార్టేజ్ స్టూడెంట్లను వేధిస్తోంది. 83 మంది టీచర్లు సెలవులు జెన్యూన్గా పెట్టారా? లేదా? అనే విషయంపై విచారణ చేస్తున్నాం. సరైన కారణాలు చూపని వారిపై చర్యలు ఉంటాయి. అవసరంలేని డిప్యుటేషన్లు రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం.
- దుర్గాప్రసాద్, డీఈవో