సైయెంట్ ఫైనల్​​ డివిడెండ్​ రూ. 16.. మొత్తం డివిడెండ్​ రూ. 24

సైయెంట్ ఫైనల్​​ డివిడెండ్​ రూ. 16.. మొత్తం డివిడెండ్​ రూ. 24

హైదరాబాద్​, వెలుగు: సైయెంట్​ లిమిటెడ్​ 2022–23 ఫైనాన్షియల్​ ఇయర్​కు షేర్​ ఒక్కింటికి రూ. 16 చొప్పున ఫైనల్​ డివిడెండ్​ ప్రకటించింది. ఫేస్​ వాల్యూ రూ. 5 గా ఉన్న షేర్​పై ఈ డివిడెండ్​ 320 శాతానికి సమానమవుతుంది. గత 12 నెలల్లో సైయెంట్ షేరుకి​ రూ. 24 చొప్పున డివిడెండ్​ డిక్లేర్​ చేసింది. మార్చి 2023 క్వార్టర్లో సైయెంట్​ నికర లాభం 6 శాతం పెరిగి రూ. 163 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్​గా చూసినా నికర లాభం 4 శాతం ఎక్కువైంది.

మార్చి 2023 క్వార్టర్లో సైయెంట్​ రెవెన్యూ రూ. 1,751 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది క్యూ 4 లో కంపెనీ రెవెన్యూ రూ. 1,181 కోట్లు మాత్రమే. ఇక 2023–24 లో రెవెన్యూ పెరుగుదల 15–20 శాతం దాకా ఉండొచ్చని కంపెనీ​ అంచనా వేస్తోంది. తమ సబ్సిడరీ కంపెనీ ఒకదానిపై యూఎస్​ డిస్ట్రిక్ట్ ​ కోర్టులో సివిల్​ క్లాస్​ యాక్షన్​ యాంటి ట్రస్ట్​ కేసు ఒకటి దాఖలైనట్లు సైయెంట్​ తెలిపింది. ఈ కేసు కోసం యూఎస్​ సబ్సిడరీ రూ. 16.20 కోట్లను లీగల్​ ఖర్చులుగా వెచ్చించాల్సి వచ్చిందని పేర్కొంది. రిజల్ట్స్​ నేపథ్యంలో గురువారం సెషన్లో సైయెంట్​ షేర్లు 2.02 శాతం పెరిగి రూ. 1,091.45 వద్ద క్లోజయ్యాయి.