ఎఫ్​పీఐల డిస్​క్లోజర్​ రూల్స్ మార్పు

ఎఫ్​పీఐల డిస్​క్లోజర్​ రూల్స్ మార్పు

న్యూఢిల్లీ: మన క్యాపిటల్​ మార్కెట్లో మరింత ట్రాన్స్​పరెన్సీ తెచ్చేందుకు వీలుగా ఫారిన్​ పోర్ట్​ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్​పీఐ)ల డిస్​క్లోజర్​ రూల్స్​ను మార్చాలని సెబీ ప్రపోజ్​ చేస్తోంది. ఒకే కంపెనీ లేదా గ్రూప్​లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే హై–రిస్క్​ ఎఫ్​పీఐలు మరిన్ని వివరాలను ఇచ్చేలా రూల్స్​ మార్చాలనుకుంటోంది సెబీ.  

దేశీయ కంపెనీల టేకోవర్​కు ఎఫ్​పీఐ రూట్​ను వాడుకోకుండా చూడాలనేది కూడా సెబీ ఉద్దేశాలలో ఒకటి. అదానీ గ్రూప్​ షేర్లలో కొన్ని ఎఫ్​పీఐలు షార్ట్​ సెల్లింగ్​కు పాల్పడినా,  బెనిఫిషియల్​ ఓనర్లెవరో సెబీ తెలుసుకోలేకపోయింది. ఇప్పుడున్న రూల్స్​ ప్రకారం ఇది కుదరలేదు.