మే నెలలో చనిపోయిన వ్యక్తికి డిసెంబర్​లో సెకండ్ ​డోస్

మే నెలలో చనిపోయిన వ్యక్తికి డిసెంబర్​లో సెకండ్ ​డోస్

రాజ్​గఢ్: మధ్యప్రదేశ్​లోని రాజ్​గఢ్ ​జిల్లాలో మే నెలలో చనిపోయిన ఓ వ్యక్తి ఫోన్​కు డిసెంబర్​లో సెకండ్ ​డోస్​ వ్యాక్సిన్​ పూర్తయినట్లు మెసేజ్​వచ్చింది. అది చూసి షాక్​ తిన్న కుటుంబ సభ్యులు ఆఫీసర్ల దగ్గరకు పోతే.. కంప్యూటర్​ తప్పిదం వల్ల వచ్చి ఉంటుందని తేల్చేశారు. రాజ్​గఢ్​​ జిల్లా బియోరా పట్టణానికి చెందిన పురుషోత్తం శక్యవార్(78) ఏప్రిల్​8న కరోనా ఫస్ట్​డోస్​ వ్యాక్సిన్​ వేసుకున్నాడు. అనారోగ్య కారణాల వల్ల అతను మే 24న చనిపోయాడు. ఆయన​చనిపోయిన దాదాపు ఆరు నెలల తర్వాత డిసెంబర్​3న సెకండ్​ డోస్​ వ్యాక్సిన్​ పూర్తయింది అని శక్యవార్​ ఫోన్​కు మెసేజ్​వచ్చింది. అది చూసిన కుటుంబ సభ్యులు వ్యాక్సిన్​ సర్టిఫికెట్​డౌన్​లోడ్​ చేయగా.. పురుషోత్తం శక్యవార్ ​రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకున్నట్లు ఉంది. ఈ విషయమై కుటుంబ సభ్యులు వివరణ కోరగా.. కంప్యూటర్ ఎర్రర్​ కారణంగా ఫోన్​ నెంబర్​ తప్పు పడి మెసేజ్​వచ్చి ఉంటుందని అధికారులు చెప్పారు. దానిపై విచారిస్తున్నట్లు జిల్లా వ్యాక్సినేషన్​ ఆఫీసర్​ పీఎల్​భగోరియా తెలిపారు.