అభివృద్ధిని చూసి ఓటేయ్యాలె : ముఠా గోపాల్

అభివృద్ధిని చూసి ఓటేయ్యాలె : ముఠా గోపాల్

ముషీరాబాద్, వెలుగు: సెగ్మెంట్​లో చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సెగ్మెంట్ పరిధి అడిక్ మెట్, చర్చిలైన్, స్వామి హాస్పిటల్, మేడిబాయి బస్తీ, రామాలయం, టీఆర్టీ కాలనీ, లక్ష్మమ్మ పార్క్, గణేశ్​నగర్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ఇంటింటికి పాదయాత్ర చేస్తూ వెళ్లారు.

ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. తనను మరోసారి గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. ఆయన వెంట చిట్టి శ్యాంసుందర్, నేత శ్రీనివాస్, ఖాదిర్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.