
వజ్ర యోగి, శ్రేయ భారతి ప్రధానపాత్రల్లో సుధాకర్ పాణి తెరకెక్కిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘సీమంతం’. టీఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రశాంత్ టాటా నిర్మిస్తున్నారు. శుక్రవారం దర్శకుడు తేజ చేతులమీదుగా ఈ మూవీ టీజర్ను విడుదల చేయించారు.
గర్భిణీ మహిళలపై హత్యల నేపథ్యంలో సాగిన ఈ టీజర్ ఆసక్తికరంగా ఉందని.. విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్తో పాటు థిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయంటూ టీమ్కు తేజ బెస్ట్ విషెస్ చెప్పారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఎస్. సుహాస్ సంగీతం అందిస్తున్నాడు.