గుజరాత్​ ఇన్ఫర్మేషన్​ కమిషన్​ సంచలన నిర్ణయం

గుజరాత్​ ఇన్ఫర్మేషన్​ కమిషన్​ సంచలన నిర్ణయం

అహ్మదాబాద్: ఆర్టీఐ యాక్ట్​ను ఉపయోగించి.. అధికారులను ఇబ్బందులకు గురి చేసిన 9 మందిపై గుజరాత్​ ఇన్ఫర్మేషన్​ కమిషన్​ (జీఐసీ) లైఫ్​ టైం బ్యాన్​ విధించింది. వీరిని బ్లాక్​లిస్ట్​లో చేర్చింది. తమకు కావాల్సిన సమాచారం కోసం వీరంతా మళ్లీ.. మళ్లీ ఆర్టీఐకు దరఖాస్తు చేసుకోవడాన్ని కమిషన్​ తీవ్రంగా పరిగణించింది. ఇక వీరు ఎలాంటి సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న స్పందించొద్దని ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్​లో ఇలా లైఫ్​ టైం బ్యాన్​ విధించడం తొలిసారి. ఈ 9 మంది.. ఆర్టీఐ యాక్ట్​ను రిపీట్​గా ఉపయోగిస్తూ వచ్చారని, అప్లికేషన్స్​తో అధికారులను ఇబ్బంది పెట్టారని, తప్పుడు ఉద్దేశాలతో క్వశ్చన్​ చేశారని, విసుగెత్తించారని కమిషన్​ అధికారులు తెలిపారు.