స్టాక్ మార్కెట్లో బుల్ రన్

స్టాక్ మార్కెట్లో బుల్ రన్

స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నయి. క్రూడాయిల్ ధరలు తగ్గడం కూడా ట్రేడింగ్కు కలిసొచ్చింది. ఫలితంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 680 పాయింట్లకుపైగా లాభంతో 59,090 వద్ద కొనసాగుతోంది. 

భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ, రిలయెన్స్, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, మారుతి సుజుకీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 200లకు పైగా పాయింట్ల ప్రాఫిట్ తో 17,500 వద్ద ట్రేడవుతోంది.