
మాదాపూర్, వెలుగు: రాష్ట్రంలో పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్కు శ్రీరామ రక్ష అని ఆ పార్టీ శేరిలింగంపల్లి సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ తెలిపారు. శుక్రవారం మాదాపూర్ డివిజన్లోని చంద్రనాయక్ తండా, సర్వే ఆఫ్ ఇండియా, అయ్యప్పసొసైటీ, సాయినగర్, మెగా హిల్స్, హరిజన బస్తీ, అరుణోదయ కాలనీల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.