సర్వీస్ రోడ్డు నిర్మించాలని మంత్రికి వినతి

సర్వీస్ రోడ్డు నిర్మించాలని మంత్రికి వినతి

జైపూర్, వెలుగు: టేకుమట్ల నుంచి వరంగల్ వరకు నేషనల్ హైవేలో భాగంగా గ్రామానికి సర్వీస్​ రోడ్డు నిర్మించాలని మాజీ సర్పంచ్ ​గోనె సుమలత, ఆమె భర్త నర్సయ్య కోరారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర కార్మిక, గనులు, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని సచివాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.