
ముషీరాబాద్, వెలుగు: లంబాడీలను బీసీ జాబితాలో కలపాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ నాయక్ ఆరోపించారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి ఆయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ నెల 29న హైదరాబాద్లో 11వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఐటీడీఏ మ్యూజియంలలో లంబాడీ ఆనవాళ్లు లేకుండా చేశారని, మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. లంబాడీ భూములను గుంజుకుంటున్నారని, 10% ఎస్టీ రిజర్వేషన్ సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. రాష్ట్ర కన్వీనర్ మాలోతు సైదనాయక్, నగర అధ్యక్షుడు కల్యాణ్ నాయక్, వ్యవస్థాపక సభ్యులు స్వరాజ్ నాయక్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్ నాయక్ పాల్గొన్నారు.