ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. కొత్తగా వస్తున్న జడ్జీలు అందరూ సీనియర్ న్యాయవాదులే. ఈనెల 29వ తేదీన జరిగిన కొలీజియం సమావేశంలో ఏడుగురు సీనియర్ న్యాయవాదులను ఏపీ హైకోర్టుకు జడ్జీలుగా నియమించే ప్రతిపాదనకు కొలీజియం ఆమోదం తెలిపింది. జడ్జీలుగా రానున్న న్యాయవాదుల పేర్లు... వడ్డిబోయిన సుజాత, కొనకంటి శ్రీనివాస రెడ్డి,  నిమ్మగడ్డ వెంకటేశ్వరులు, తర్లాడ రాజశేఖర రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీమలపాటి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ పేర్లను సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టుతోపాటు మధ్యప్రదేశ్, ఒడిశా, మద్రాస్ హైకోర్టులకు కూడా కొత్త న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. 

 

ఇవి కూడా చదవండి

మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో విచారణ స్పీడప్

ములాయం కాళ్లు మొక్కిన స్మృతి ఇరానీ