న్యూఢిల్లీ: టాటా సన్స్ ఐపీఓ వస్తోందనే వార్తల కారణంగా ఈ వారం అనేక గ్రూప్ స్టాక్స్ 36 శాతం వరకు పెరిగాయి. పేరెంట్కంపెనీ ఆర్బీఐ నిబంధనలకు కట్టుబడి వివిధ మార్గాలను పరిశీలిస్తున్నందున ఇప్పట్లో లిస్టింగ్ ఉండబోదని మార్కెట్పరిశీలకులు అంటున్నారు. టాటా సన్స్ ఆర్బీఐలో సీఐసీగా రిజిస్టర్అయింది. 'అప్పర్ లేయర్' ఎన్బీఎఫ్సీగా దీనిని పిలుస్తారు. దీనివల్ల కంపెనీ కఠినమైన నియంత్రణ నిర్మాణాన్ని అనుసరించాలి.
నోటిఫై చేసిన మూడు సంవత్సరాలలోపు పబ్లిక్ మార్కెట్లో లిస్ట్ కావాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 2025 నాటికి టాటా సన్స్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కావాలి. అయితే టాటా సన్స్ మాత్రం టాటా క్యాపిటల్ను విడదీయడంతో సహా రకరకాల ప్రపోజల్స్ను పరిశీలిస్తోంది.