పినపాక, వెలుగు: భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జడ్పీ స్కూల్లో ఎస్జీఎఫ్అండర్–-17 బాలుర నేషనల్లెవల్కబడ్డీ పోటీలు రెండో రోజు గురువారం ఉత్సాహంగా జరిగాయి. వివిధ రాష్ట్రాల క్రీడాకారులు, కోచ్లతో ఏడూళ్లబయ్యారం జడ్పీ స్కూల్ సందడిగా మారింది.
రెండో రోజు జరిగిన 18 లీగ్మ్యాచ్ల్లో పంజాబ్పై మధ్యప్రదేశ్, కేంద్రీయ విద్యా సమితిపై విద్యాభారతి, చండీఘర్ పై ఒడిశా, త్రిపురపై ఏపీ, సీఐఎస్సీఈపై పుదుచ్చేరి, తమిళనాడుపై తెలంగాణ, ఢిల్లీపై కర్ణాటక, హిమాచల్ప్రదేశ్పై మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ పై రాజస్థాన్, కేవీఎస్పై హర్యానా, ఎన్వీఎస్పై మధ్యప్రదేశ్, జార్ఖండ్పై మణిపూర్, వెస్ట్బెంగాల్పై సీబీఎస్ఈ, జమ్ముకాశ్మీర్పై గుజరాత్, చత్తీస్గఢ్పై యూపీ, ఎన్వీఎస్పై పంజాబ్, సీబీఎస్ఈపై కేరళ, విద్యాభారతిపై అసోం జట్లు విజయం సాధించాయి. హర్యానా టీమ్71పాయింట్స్తో, ఏపీ టీమ్70తో ప్రతిభను చాటాయి. పోటీలను డీఈవో బి.నాగలక్ష్మి మౌరిటెక్ఫౌండేషన్, కంది చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పర్యవేక్షించారు.
