న్యూఢిల్లీ: బాలీవుడ్ చరిత్రలో షోలే తర్వాత అంత పాపులర్ చిత్రాల్లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ని ఒకటిగా సినీ ప్రియులు చెబుతుంటారు. ఈ సినిమాతో షారుఖ్-కాజోల్ జంట సూపర్స్టార్ డమ్ తెచ్చుకుంది. 25 ఏళ్ల కింద వచ్చిన ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ సినిమాలో షారుఖ్, కాజోల్ జంటగా ఉన్న ఒక సీన్ కాంస్య విగ్రహాలను లండన్లోని లీసెస్టర్ స్క్వేర్లో ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఒక బాలీవుడ్ మూవీ సీన్ స్టాచ్యూను యూకేలో ఆవిష్కరించడం ఇదే తొలిసారి అని ఆయన ట్వీట్ చేశారు. యావత్ దేశ సినీ ఆడియన్స్, యూత్ మదిని దోచుకున్న దిల్వాలే చిత్రాన్ని ఆదిత్య చోప్రా డైరెక్ట్ చేశారు.
UPDATE… Bronze statue of #SRK and #Kajol to be unveiled at #London’s #LeicesterSquare to mark 25th anniversary of #DDLJ… Will be unveiled in Spring 2021… The first ever #Bollywood movie statue erected in #UK… #DDLJ is directed by #AdityaChopra. pic.twitter.com/qqDgrnMipU
— taran adarsh (@taran_adarsh) October 19, 2020