
శర్వానంద్ హీరోగా ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్స్. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్ కెరీర్లో ఇది 37వ చిత్రం. గత పదిరోజులుగా కేరళలో షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయింది.
శర్వా, సాక్షి వైద్య కాంబినేషన్లో బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ పాటను చిత్రీకరించారు. అలాగే పృథ్వీ మాస్టర్ నేతృత్వంలో ఓ ఫైట్ సీక్వెన్స్ను తీశారు. దాంతో పాటు ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను కూడా తీశామని దర్శకనిర్మాతలు తెలియజేశారు. దీనికి భాను బోగవరపు కథ అందించగా, నందు సావిరిగాన డైలాగ్స్ రాశారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయనున్నారు.