ఛీ..ఛీ ఇంత నీచ రాజకీయాలా.. ఆమె నా కంటే చాలా చిన్నది : శశిథరూర్

ఛీ..ఛీ ఇంత నీచ రాజకీయాలా..  ఆమె నా కంటే చాలా చిన్నది  :  శశిథరూర్

కాంగ్రెస్  సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ  శశిథరూర్..  టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై  స్పందించారు. దీనిపై ఆయన  తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  ఈ ఫోటోలను వైరల్ చేయడాన్ని ఆయన నీచ రాజకీయాలంటూ మండిపడ్డారు.  ఈ మేరకు కేరళలో మీడియాతో మాట్లాడారు. 

వైరల్ గా మారిన ఫోటోలు  ఆమె పుట్టినరోజు వేడుకలో దిగినవని చెప్పారు శశిథరూర్ . ఆ వేడుకలో 15 మంది పాల్గొన్నారని, అందులో తన సోదరి కూడా ఉన్నారని  తెలిపారు. .  కానీ కొందరు దురుద్దేశపూర్వంగా పార్టీకి వచ్చిన మిగతావారిని తొలగించి, అదొక వ్యక్తిగత సమావేశంగా ఫొటోలను వక్రీకరించారు.  మహువా తన కంటికి చిన్న పిల్లలాగా కనిపిస్తుందన్న శశిథరూర్ ..  తన  కంటే ఆమె 10 నుంచి 20 ఏళ్లు చిన్నదని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తోన్న విమర్శలను తాను పట్టించుకోనని, ప్రజల కోసం పనిచేయడానికి ప్రాముఖ్యత ఇస్తానని థరూర్‌ వెల్లడించారు.

Also Read :- బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం 

అంతకుముందు దీనిపై  మహువా మొయిత్రా కూడా స్పందించారు.  ‘నాకు తెలుపు రంగు కంటే ఆకుపచ్చ రంగు నచ్చుతుంది. ఎందుకు ఫొటోలను క్రాప్‌ చేశారు. డిన్నర్‌కు వచ్చిన మిగతావారిని కూడా చూపించండి. బెంగాల్ మహిళలు పూర్తి జీవితాన్ని ఆస్వాదిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు’ అంటూ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.