డెంగీతో ఆరేండ్ల చిన్నారి మృతి

డెంగీతో ఆరేండ్ల చిన్నారి మృతి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన షాజ్మీన్ (6) డెంగీతో హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​  రెయిన్ బో చిన్నపిల్లల దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి చనిపోయింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..జిల్లా కేంద్రంలోని రహత్ నగర్ కాలనీకి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ మహ్మద్​షాకీర్ కూతురు షాజ్మీన్​కు వారం రోజుల కింద జ్వరం వచ్చింది. 

దీంతో ఓ ప్రైవేట్ దవాఖానలో పరీక్షలు నిర్వహించగా, డెంగీగా నిర్ధారణయ్యింది. దీంతో ఆమెను హైదరాబాద్ లోని రెయిన్ బో హాస్పిటల్​లో చేర్పించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న షాజ్మీన్ కు​గుండెపోటు రావడంతో చనిపోయింది. వారం రోజుల చికిత్స కోసం రూ.18 లక్షలు అప్పు చేసి వైద్యం చేయించినా పాప దక్కలేదని షాకీర్​ఆవేదన వ్యక్తం చేశాడు. షాజ్మీన్ శాంతినికేతన్ స్కూల్​లో ఒకటో తరగతి చదువుతోంది.