బోనాల ఉత్సవాల్లో అసభ్య చేష్టలు..షీ టీమ్స్కు చిక్కిన 644 మంది చిల్లరగాళ్లు

బోనాల ఉత్సవాల్లో అసభ్య చేష్టలు..షీ టీమ్స్కు చిక్కిన 644 మంది చిల్లరగాళ్లు
  • వీరిలో 92 మంది మైనర్లే

హైదరాబాద్​సిటీ, వెలుగు : బోనాల ఉత్సవాల్లో మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన పోకిరీలను షీ టీమ్స్​పోలీసులు పట్టుకున్నారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, గోల్కొండ, లష్కర్, లాల్​దర్వాజ బోనాల ఉత్సవాల్లో నిఘా పెట్టగా, 644 మందిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నట్లు షీ టీమ్స్​డీసీపీ లావణ్య గురువారం తెలిపారు. 

వీరిలో 92 మంది మైనర్లు ఉండడం గమనార్హం. నిందితుల్లో ఐదుగురిని (రామ్ ఆనంద్​, నీలకంఠ, బాలరాజు, లక్ష్మణ్, దినేశ్) అరెస్ట్​చేసి, నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, 7 రోజుల జైలు శిక్ష  పడినట్లు తెలిపారు. పబ్లిక్​ ప్లేస్​లో మహిళలు జాగ్రత్తగా ఉండాలని, వేధింపులపై షీ టీమ్స్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.