న్యూఢిల్లీ: కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ధరల పెరుగుదల వంటి సమస్యల వల్ల ప్రపంచమంతటా స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు భారీగా తగ్గాయి. పోయిన ఏడాది మొదటి మూడు నెలలతో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (క్యూ1) షిప్మెంట్లు 11 శాతం తగ్గాయని గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ ఎనలిస్ట్ ఫర్మ్ కెనలిస్ తెలిపింది. ఇది విడుదల చేసిన రిపోర్టు ప్రకారం... ఇదేకాలంలో శామ్సంగ్ మార్కెట్ వాటా 22 శాతం నుంచి 24 శాతానికి పెరిగింది. శామ్సంగ్, యాపిల్ షిప్మెంట్ల పరంగా మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. షావోమీ, ఒప్పో, వివో టాప్–5 లిస్టులో ఉన్నాయి. ఫ్లాగ్షిప్ మోడల్ గెలాక్సీ ఎస్22 సిరీస్ఫోన్లు భారీగా అమ్ముడుకావడంతో మార్కెట్ వాటా పెరిగిందని శామ్సంగ్ తెలిపింది. ఎక్కువగా గిరాకీ ఉన్న గెలాక్సీ ఏ, ఎం సిరీస్లలోనూ మోడల్స్ సంఖ్యను పెంచింది. యాపిల్ షిప్మెంట్లు 2021 క్యూ1లో 15 శాతం ఉండగా, ఈసారి క్యూ1లో ఇవి 18 శాతానికి చేరాయి. కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ ఎస్ఈ మోడల్ ధర కొంచెం తక్కువ కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఐఫోన్ 13 అమ్మకాలు కూడా బాగున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. 5జీ ఫోన్లను కూడా జనం ఎగబడి కొంటున్నారు. షావో, ఒప్పో షిప్మెంట్లు ఒక్కశాతం తగ్గాయి. చిప్ల వంటి విడిభాగాల కొరత తగ్గుతోందని, త్వరలోనే పూర్తిస్థాయి సప్లై మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని కెనలిస్ట్ రిపోర్టు పేర్కొంది. దీనివల్ల ఖర్చులు తగ్గి రాబోయే క్వార్టర్లలో ఇండస్ట్రీ ఇంకా ముందుకు వెళ్తుందని వివరించింది.
మార్కెట్లోకి స్మార్ట్ఫోన్లు తక్కువ వస్తున్నాయ్
- బిజినెస్
- April 21, 2022
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు