శివసేన-బీజేపీ ఎప్పటికైనా కలుస్తయ్

శివసేన-బీజేపీ ఎప్పటికైనా కలుస్తయ్

ముంబై: శివసేన, మహారాష్ట్ర ఎప్పటికీ శత్రువుల్లాగే ఉండిపోవని బీజేపీ సీనియర్ నేత సుధీర్ ముంగంటివార్ అన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను బుధవారం కలిసిన సుధీర్.. బీజేపీ-శివసేన బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘శివసేన-బీజేపీ ఎప్పటికీ శత్రువల్లాగా ఉండవు. ఇరు పార్టీలకూ సిద్ధాంతపరంగా చాలా సారూప్యతలు ఉన్నాయి. రెండు పార్టీలు హిందూత్వ ఎజెండాను అనుసరిస్తాయి. కాబట్టి భవిష్యత్‌‌లో తిరిగి కలిసే అవకాశాలనూ కొట్టేపారేయలేం’ అని సుధీర్ చెప్పారు. ఠాక్రేతో జరిగిన భేటీలో తన అసెంబ్లీ నియోజకవర్గం చంద్రాపూర్‌లోని స్థానిక సమస్యల గురించి చర్చించామని ముంగంటివార్ అన్నారు.