
చాంగ్జౌ (చైనా): ఆసియా గేమ్స్ ముంగిట ఆ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వనున్న చైనాలో ఇండియా షట్లర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. చైనా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్లో ఒక్కరు కూడా తొలి రౌండ్ దాటలేకపోయారు. వరల్డ్ నం.2 సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ బుధవారం జరిగిన మెన్స్ డబుల్స్ తొలి రౌండ్లో 17–-21, 21–-11, 17-–21తో 13వ ర్యాంకర్ షోహిబుల్ ఫిక్రి–బగాస్ (ఇండోనేసియా) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి–రోహన్ 15–21, 16–21తో టాంగ్ జియె–తో యె వీ (మలేసియా) చేతిలో ఓడిపోయింది.