సెటిల్ మెంట్ కు పిలిచి కాల్పులు..ఇద్దరు మృతి

సెటిల్ మెంట్ కు పిలిచి కాల్పులు..ఇద్దరు మృతి

హైదరాబాద్ నగర శివార్లలోని కర్ణంగూడలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు.   ఇవాళ ఉదయం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడాలో సెటిల్మెంట్ కు పిలిచి రాఘవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అనే ఇద్దరు రియల్టర్ల పైన కాల్పులు జరిపారు మరో రియల్టర్. స్పాట్ లోనే శ్రీనివాస్ రెడ్డి మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రఘువీరారెడ్డి మృతి చెందాడు. 

ఇవాళ ఉదయం శ్రీనివాస్, రఘులపై కాల్పులు జరగగా..శ్రీనివాస్ స్పాట్ లోనే చనిపోయాడు.. గాయలైన రఘుని  స్థానిక BN రెడ్డి నగర్ లోని హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. సెటిల్మెంట్ కి పిలిచి కాల్పులు జరిపినట్టు రఘు తెలిపారు. సీసీ కెమెరాలు, కాల్ డేటా ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. శ్రీనివాస్ రెడ్డిది అల్మాస్ గూడలోని వినాయక నగర్ కాగా....రాఘవేందర్ రెడ్డిది RN రెడ్డిగా నగర్ గా గుర్తించారు పోలీసులు.. కాల్పుల ఘటనలో మట్టారెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. దీంతో మట్టారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. 

మరిన్ని వార్తల కోసం:

నీళ్లు, బువ్వ లేకుండా 12 గంటలుగా క్యూలోనే ఉన్నం

నాలుగు రోజులుగా బంకర్ లోనే..