సియాటెల్: అమెరికాలో మరో కాల్పుల ఘటన జరిగింది. వాషింగ్టన్యకీమాలోని ఓ స్టోర్లో ఉన్మాది జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఆ తర్వాత వేరే వ్యక్తి ఫోన్ నుంచి తల్లికి కాల్ చేసి వారిని తానే చంపినట్టు నిందితుడు వెల్లడించాడు. తాను కూడా చనిపోతానని చెప్పాడు. ఉన్మాది మాటలు విన్న ఫోన్ ఓనర్..అతడి వివరాలను 911కు తెలియజేసింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సరికే తనను తాను కాల్చుకుని నిందితుడు చనిపోయాడు. అమెరికాలో ఎనిమిది రోజుల్లో ఇది ఆరో కాల్పుల ఘటన.
స్టోర్ లో ఇద్దరు.. బయట ఒకరు..
యకీమాకు చెందిన 21 ఏండ్ల జరీడ్ హడాక్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మంగళవారం సాయంత్రం తను టార్గెట్ చేసిన కన్వీనియన్స్ స్టోర్కు జరీడ్ వచ్చాడు. అక్కడ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. స్టోర్ బయటకు వచ్చిన అతడు కారులో ఉన్న మరో వ్యక్తిని కాల్చడంతో అతను కూడా చనిపోయాడు. ఓ మహిళ ద్వారా నిందితుడి వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హంతకుడు దాక్కున్న వేర్ హౌస్ను చుట్టుముట్టారు. కానీ, అప్పటికే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
పెంపుడు కుక్క గన్పై కూర్చోడంతో..
అమెరికాలోని సమ్మర్ కౌంటీలో వేటకు కుక్క ను తీసుకున్న వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోయాడు. కారు వెనక సీట్లో లోడ్ చేసిన గన్పై కుక్క కూర్చుంది. ట్రిగ్గర్ నొక్కు కుని తలలో నుంచి దూసుకెళ్ల డంతో కుక్క యజమాని అక్కడికక్కడే చనిపోయాడు.
ప్రమాదంలో ఏపీ యువతి మృతి
అమెరికాలోని సియాటెల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి మృతి చెందింది. నడుచు కుంటూ వెళ్తున్న జాహ్నవిని ఓ పోలీసు కారు వెనక నుంచి ఢీ కొట్టింది. గాయాలపాలైన జాహ్నవి.. ఆస్పత్రిలో చనిపోయింది.