పొద్దు పొద్దున్నే హైదరాబాద్‎లో కాల్పుల కలకలం.. ఏటీఎంకు వెళ్లిన వ్యక్తిపై ఫైరింగ్.. రూ.6 లక్షలు దోపిడీ

పొద్దు పొద్దున్నే హైదరాబాద్‎లో కాల్పుల కలకలం.. ఏటీఎంకు వెళ్లిన వ్యక్తిపై ఫైరింగ్.. రూ.6 లక్షలు దోపిడీ

హైదరాబాద్: పొద్దు పొద్దున్నే తుపాకీ మోతతో హైదరాబాద్ నగరం ఉలిక్కిపడింది. శనివారం (జనవరి 31) ఉదయం కోఠి ఎస్‎బీఐ ప్రధాన కార్యాలయం దగ్గర కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తిపై గన్‎తో కాల్పులు జరిపి రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. 

వివరాల ప్రకారం.. రషీద్ అనే వ్యక్తి శనివారం (జనవరి 31) ఉదయం 7 గంటల ప్రాంతంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు కోఠి ఎస్‎బీఐ ప్రధాన కార్యాలయం దగ్గర ఏటీఎమ్‎కు వెళ్లాడు. ఈ క్రమంలో రషీద్‎ను ఫాలో అయిన గుర్తు తెలియని దుండగులు అతనిపై కాల్పులు జరిపి రూ.6 లక్షల డబ్బు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రషీద్ కాలికి బులెట్ గాయమైంది. 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ రషీద్‎ను ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు ఘటన స్థలంలో సీసీటీవీ ఫుటేజ్‎ను పరిశీలిస్తున్నారు. పొద్దు పొద్దున్నే కాల్పుల మోతతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.