క్రీడల్లో ప్రతిభను చూపాలి : జీఎం ఎన్.రాధాకృష్ణ

క్రీడల్లో ప్రతిభను చూపాలి :  జీఎం ఎన్.రాధాకృష్ణ
  • మందమర్రి ఏరియా సింగరేణి  జీఎం ఎన్​.రాధాకృష్ణ 

కోల్​బెల్ట్​,వెలుగు:  క్రీడా స్ఫూర్తితో ప్రతిభను చూపాలని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్​.రాధాకృష్ణ సూచించారు.  శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి లెవల్​ఆఫీసర్లు, కుటుంబసభ్యుల క్రీడలను జీఎం రాధాకృష్ణ-, వాణి దంపతులు, బెల్లంపల్లి రీజియన్​సేఫ్టీ జీఎం కె.రఘుకుమార్, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల జీఎంలు ఎం.శ్రీనివాస్​,ఎం.విజయభాస్కర్​రెడ్డితో కలిసి ప్రారంభించారు. 

మందమర్రిలోని ఇల్లందు క్లబ్​,సీఈఆర్​ క్లబ్​,రామకృష్ణాపూర్​లోని ఆర్కేసీఏఓ క్లబ్​ నిర్వహించే  పోటీల్లో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సీఎండీ బలరాంనాయక్​ ఆదేశాలతో సోక్లస్ట్ – -2025( సింగరేణి ఆఫీసర్స్ క్లబ్స్ షటిల్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్,) పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఈసారి లాన్​ టెన్నిస్​కూడా చేర్చారన్నారు. మూడు రోజుల జరిగే పోటీల్లో సింగరేణివ్యాప్తంగా 12 ఏరియాలకు చెందిన ఆఫీసర్లు పాల్గొంటున్నారన్నారు. ఆదివారం బహుమతి ప్రదానోత్సవానికి సీఎండీ హాజరుకానున్నట్లు చెప్పారు. ముందుగా పోటీల టార్చ్​ను వేదిక వద్దకు తీసుకొచ్చారు. 

మందమర్రి ఏరియా ఎస్వో టు జీఎం జి.లలితేంద్రప్రసాద్, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ రమేశ్, శాంతి ఖని ఏజెంట్,సోక్లస్ట్​ కోఆర్డినేటర్​అబ్దుల్ ఖదీర్, డీజీఎం పర్సనల్ అశోక్, అన్ని ఏరియాల సీనియర్ ఆఫీసర్లు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.----