Shreyas Iyer: ఐపీఎల్ 2026 (IPL 2026) ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్స్పై పంజాబ్ కింగ్స్ (PBKS) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత లభించిన ఈ విజయంతో పంజాబ్ ఊపిరి పీల్చుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (51 బంతుల్లో 101* పరుగులు) అద్భుత శతకంతో చెలరేగి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లోనే శ్రేయస్కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం.
మా ప్లేఆఫ్స్ భవిష్యత్తు ముంబై చేతుల్లోనే ఉంది:
శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. నేను చాలా సంతోషంగా ఉన్నా.. అత్యంత కీలక సమయంలో నా ఐపీఎల్ కెరీర్ తొలి సెంచరీ రావడం చాలా సంతోషంగా ఉంది.. వరుసగా ఆరు ఓటముల తర్వాత గెలిచాం.. కానీ, మేము ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే మా ఆశలన్నీ ముంబై ఇండియన్స్ - రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఫలితంపైనే ఉన్నాయి.. అందుకే మా పంజాబ్ అభిమానులంతా ఇవాళ్టి మ్యాచ్లో ముంబైకి మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాను అని శ్రేయస్ కోరాడు.
చాహల్, అజ్మత్ బౌలింగే టర్నింగ్ పాయింట్..
మొదటి ఓవర్లోనే మా బౌలర్లు 16 పరుగులు ఇచ్చినా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నారు. అజ్మతుల్లా ఒమర్జాయ్ డెబ్యూ ఓపెనర్ను గోల్డెన్ డకౌట్ చేసి లక్నోను దెబ్బకొట్టాడు.. ఇక స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పరుగులను నియంత్రించడమే కాకుండా కీలక వికెట్లు తీశాడు.. లక్నో కెప్టెన్ రిషభ్ పంత్తో పాటు వినాశకరంగా ఆడుతున్న ఆయుష్ బదోనీని చాహల్ అవుట్ చేయడంతోనే లక్నో పరుగుల వేగం మందగించిం
►ALSO READ | వాంఖడేలో రాజస్థాన్ రాయల్స్ ‘రాయల్’ కంబ్యాక్.. ముంబై ముందు 206 రన్స్ టార్గెట్..
కోచ్ కి ఓ కండిషన్ పెట్టాను:
నేను సహచరులకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వను.. పరిస్థితులను ఎంత వీలైతే అంత సింపుల్గా ఉంచమని చెబుతాను అని శ్రేయస్ పేర్కొన్నాడు. అనవసరంగా మీటింగ్లు పెట్టి కుర్రాళ్లను ఒత్తిడికి గురిచేయడం నాకు నచ్చదు.. అందుకే ఈ మ్యాచ్కు ముందు మా హెడ్ కోచ్ రికీ పాంటింగ్ను ఒకటే అడిగా.. ఎలాంటి మ్యాచ్ మీటింగ్స్ వద్దు' అని కోరాను.. నేరుగా మైదానంలోకి దిగి స్వేచ్ఛగా ఏం చేయాలో అది చేద్దామని జట్టును ఉత్సాహపరిచా.. ఆ ప్లాన్ వర్కవుట్ అయింది, ఇప్పుడు సానుకూల ఫలితం వచ్చిందని కెప్టెన్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
