హైదరాబాద్: ప్రగతి భవన్లో శుభకృత్ నామ సంవత్సర ఉగాది సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించారు. శుభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. పంచాంగం శ్రవణం కొనసాగుతోంది.
మరిన్ని వార్తల కోసం...