హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు

హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు

పోర్ట్‌‌‌‌ ఆఫ్‌‌ స్పెయిన్‌‌ (ట్రినిడాడ్‌‌): వెస్ట్ ఇండీస్ తో 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ జరుగుతున్న ఫస్ట్ వన్డేలో భారత్ భారీ స్కోర్ దిశగా వెళ్తుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు మంచి స్టార్ట్ లభించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, గిల్ దూకుడుగా ఆడుతున్నారు. అందివచ్చిన బాల్స్ ని బౌండరీలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసున్నారు. 17 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 117 రన్స్ చేసింది. గిల్(62), ధావన్(50) రన్స్ తో క్రీజులో ఉన్నారు. మొదటి వికెట్ కోసం విండీస్ బౌలర్లు చెమటోడుస్తున్నా.. మనోళ్లు వాళ్లకి అవకాశం ఇవ్వడంలేదు. 50 ఓవర్ల వరకు ఇలాగే ఆడితే భారత్ స్కోర్ 400 దాటినా దాటొచ్చు.