హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (బాయ్స్)లో విద్యార్థి వివేక్ మృతి ఘటనపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేసినట్లు తేలడంతో ఆరుగురు పార్ట్టైం టీచర్లను సస్పెండ్ చేసినట్లు టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ జిల్లా సమన్వయకర్త ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 7న సనాదుల వివేక్(13) రోప్ తో ఆడుతూ ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఈ ఘటనపై ఆర్డీవో రామ్మూర్తి విచారణ చేపట్టి నివేదిక అందజేశారు.
