
సిద్ధార్థ్ హీరోగా కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘టక్కర్’. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే టీజర్, రెండు సాంగ్స్తో ఇంప్రెస్ చేసిన టీమ్.. ట్రైలర్ను విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ను లాంచ్ చేసిన హీరో సాయి ధరమ్ తేజ్... ఇంటరెస్టింగ్గా, ఎంటర్టైనింగ్గా ఉందంటూ టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పాడు.
డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న కామన్ మ్యాన్గా సిద్ధార్థ్.. డబ్బున్న అమ్మాయిగా దివ్యాంశ కనిపిస్తున్నారు. వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇంప్రెస్ చేస్తోంది. తనను ఎంతో నమ్మిన ఆమెను కిడ్నాప్ చేసే పరిస్థితి హీరోకి ఎందుకొచ్చింది.. వాళ్లను విలన్స్ ఎందుకు వెంటాడుతున్నారు అనే అంశాలు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. యోగిబాబు కామెడీ ఇంప్రెసివ్గా ఉంది. మొత్తానికి లవ్, రొమాన్స్, కామెడీ, యాక్షన్ కలగలిసిన కమర్షియల్ ఎంటర్టైనర్ ఇదని అర్థమవుతోంది. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.