పశువుల అక్రమ రవాణా అరికట్టాలి : సీపీ అనురాధ

పశువుల అక్రమ రవాణా అరికట్టాలి : సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి వాహనాల తనిఖీలు నిర్వహించాలని రాత్రి సమయంలో తప్పకుండా టార్చ్ లైట్ ఉపయోగించాలని సీపీ అనురాధ సూచించారు. బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణా నియంత్రణ కోసం రంగధాంపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను మంగళవారం తనిఖీ చేసారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి  జిల్లా సరిహద్దులో 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.

జంతువుల అక్రమ రవాణా, గోవధ విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పశువులను రవాణాచేసే ప్రతి వాహనానికి వాలిడ్ డాక్యుమెంట్స్ ఉండాలని స్పష్టం చేశారు. అంతకు ముందు విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ స్వచ్ఛంద బంద్ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో సీపీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేశారు.