సిద్ధు జొన్నలగడ్డ హీరోగా పీపుల్ మీడియా బ్యానర్లో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. సోమవారం ఈ మూవీ టైటిల్తో పాటు నటీనటులు, టెక్నీషియన్స్ను అనౌన్స్ చేశారు. ‘తెలుసు కదా’ టైటిల్తో తెరకెక్కే ఈ చిత్రంతో స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది.
రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్తో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. పీపుల్ మీడియా సంస్థలో ఇది 30వ చిత్రం. అనౌన్స్మెంట్ వీడియోలో హీరో సిద్ధు వైట్ అండ్ వైట్ సూట్తో ఇంప్రెస్ చేస్తున్నాడు. ఒక అబ్బాయి, అమ్మాయి కథతో పాటు స్నేహం, కుటుంబం, త్యాగం, సెల్ఫ్ లవ్కి సంబంధించిన కథ ఇదని మేకర్స్ తెలియజేశారు.