నేచురల్ పన్నీర్ను విడుదల చేసింది పాల ఉత్పత్తుల బ్రాండ్ సిద్స్ ఫార్మ్. తెలంగాణ కేంద్రంగా తమ వినియోగదారులకు నాణ్యమైన ఆహారం, పదార్థాలను అందించాలనే లక్ష్యంతో నేచురల్ పన్నీర్ను ఆవిష్కరించింది. పాలలో ఎలాంటి హార్మోన్లు, యాంటీ బయాటిక్స్ అలాగే నిల్వ చేసే పదార్థాలను వాడకపోవడం దీని ప్రత్యేకత. కొత్తగా ఆవిష్కరించిన పన్నీర్ ‘సాఫ్ట్ అండ్ క్రీమీ పన్నీర్’ గా పిలువబడుతుంది. తమ రోజువారీ ఆహారంలో తగినంతగా ప్రొటీన్ను పొందాలని కోరుకునే శాఖాహారులను ఇది లక్ష్యంగా చేసుకుంది. భారతదేశ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహార పదార్థాలలో ఒకటిగా ఈ పన్నీర్ నిలిచింది. మార్కెట్లో ఈ నేచురల్ పన్నీర్ 200 గ్రాముల ప్యాక్ ధర రూ. 150 గా నిర్ణయించారు. తమ వినియోగదారులకు కల్తీలేని పాల ఉత్పత్తులను అందించాలన్నదే తమ బ్రాండ్ సిద్ధాంతమన్నారు సిద్స్ ఫార్మ్స్ వ్యవస్థాపకులు,ముఖ్య కార్యనిర్వహణ అధికారి (ఫౌండర్ అండ్ సీఈవో) డాక్టర్ కిశోర్ ఇందుకూరి. తెలంగాణాలో ఆరోగ్యవంతమైన పాల ఉత్పత్తులను పరిచయం చేసిన ఒకే ఒక్క కంపెనీగా వినియోగదారుల కోసం మరిన్ని ఉత్పత్తులను అందిస్తామన్నారు.