
శ్రావణమాసం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అమ్మవారు మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే శ్రావణమాసంలో మహిళలు వ్రతాలు.. పూజలు.. నోములు చేస్తారు. శ్రావణమాసంలో మంగళవారం నిర్వహించే మంగళగౌరీ వ్రతం కొత్తగా పెళ్లైన వారే కాదు.. పెళ్లికాని అమ్మాయిలు కూడా చేయవచ్చని పండితులు చెబుతున్నారు.
హిందూ సంప్రదాయంలో పెళ్లికి ముందు పెళ్లి కూతురిచే గౌరీ పూజ చేయిస్తారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం. కాబోయే భర్త అనుకూలంగా ఉండాలని.. వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడని భక్తితో ఈ పూజను చేయిస్తారు.
శ్రావణమాసం ఎంతో విశిష్టమైనది. ఈ నెలలో మహిళలు వ్రతాలకు.. పూజలకు.. నోములకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. పురాణాల ప్రకారం ఆ రోజు ( 2025, జులై 29) పార్వతిదేవికి అంకితం చేయబడింది. ఆ రోజున మహిళలు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. శివయ్య భార్య గౌరీ దేవిని ఆచారాల ప్రకారం పూజిస్తారు.
మంగళ గౌరీ వ్రతాన్ని శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం జరుపుకుంటారు. ఈ ఏడాది జులై 29 న మంగళవారం మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు. దీని తరువాత, రెండవ మంగళ గౌరీ వ్రతాన్ని ఆగష్టు 5 వ తేదీన, మూడవది ఆగష్టు12 , నాల్గవ మరియు చివరి మంగళగౌరీ వ్రతాన్ని ఆగస్టు 19 న జరుపుకుంటారు. ఈ మంగళవారం రోజుల్లో పార్వతీ మాతను మహిళలు ప్రత్యేకంగా పుజిస్తారు. వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తే.... పెళ్లికాని అమ్మాయిలు మంచి వరుడిని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. తద్వారా కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని విశ్వాసం.
మంగళ గౌరీ పూజా విధానం
- ముందుగా శ్రావణమాసంలో మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
- తర్వాత శుభ్రమైన స్టూల్పై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి దానిపై గౌరీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించాలి
- మంగళ గౌరీ దేవి ముందు ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసి బియ్యం పిండితో చేసిన దీపం వెలిగించండి.
- దీని తరువాత మంగళ గౌరీని ధూపం, నైవేద్యం, పండ్లు, పువ్వులు మొదలైన వాటితో పూజించండి.
- పూజ ముగిసిన తర్వాత గౌరీ దేవి హారతి ఇచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలను ఇవ్వమని ప్రార్థించండి.
- ఈ రోజున వివాహిత స్త్రీలను ఇంటికి పిలిచి వాయినం ఇవ్వాలి. పసుపు కుంకుమ, తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
మంగళ గౌరీ వ్రత ప్రాముఖ్యత
మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారమవుతాయి. అదే సమయంలో పెళ్లికాని అమ్మాయిలు మంచి వ్యక్తిని తమకు భర్తగా ఇవ్వమని వరుడి కోసం ఈ వ్రతాన్ని పాటిస్తారు. ఈ ఏడాది మంగళ గౌరీ వ్రతాన్ని నాలుగు మంగళవారాలు.. నాలుగుసార్లు ఆచరించనున్నారు. అటువంటి పరిస్థితిలో ఉపవాసం ఉన్న స్త్రీలు తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రత కథను వినాలి లేదా చదవాలి. లేని పక్షంలో ఈ ఉపవాసం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.చెడు దృష్టి లేదా పిల్లలను ప్రతికూల శక్తి నుండి రక్షణ ఉంది. మంగళగౌరీ వ్రతం ఆచరించే స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అంతేకాదు సంతానం కోసం ఎదురుచూసే దంపతుల కోరిక తీరుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.