
హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన డిజిటల్ అష్యూరెన్స్, డిజిటల్ ఇంజినీరింగ్ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ ఏడాది జూన్తో ముగిసిన మొదటి క్వార్టర్లో రూ. 439.53 కోట్ల ఆదాయం సంపాదించింది. 2023 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.424.97 కోట్లు వచ్చాయి. ఇబిటా మార్జిన్ రూ. 62.07 కోట్లు ఉంది. నికర లాభం రూ.44.56 కోట్లు వచ్చింది. 2023 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.49.24 కోట్లు, గత ఏడాది జూన్ క్వార్టర్లో రూ.31 కోట్లు వచ్చాయి. తాజా క్వార్టర్లో కంపెనీ తన టాప్ 50 క్లయింట్లతో డిజిటల్ ఇంజనీరింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఫలితాలపై చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీకాంత్ చక్కిలం మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలో ఎదురుగాలులు ఉన్నా 2024 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో బలమైన పనితీరును సాధించామని చెప్పారు. రాబోయే క్వార్టర్లలో మరింత వృద్ధిని సాధించడానికి కృషి చేస్తామని అన్నారు.