L B స్టేడియంలో వెండి, ఇత్త‌డి ట్రోఫీలు మాయం

L B స్టేడియంలో వెండి, ఇత్త‌డి ట్రోఫీలు మాయం

హైదరాబాద్​ : ట్రోఫీలు మాయ‌మైన సంఘ‌ట‌న మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వెలుగు చూసింది. తెలంగాణ ఫుట్​బాల్​ అసోసియేషన్​ ఆఫీపులో ఉంచిన ట్రోఫీలు చోరి అయ్యాయని గుర్తించారు అధికారులు. కరోనా వల్ల జూలై నెలలో అసోసియేషన్​ కార్యదర్శి జీపీ కార్యాలయానికి తాళం వేశారు. అయితే 20 రోజుల తర్వాత మంగళవారం వెళ్లి చూడగా.. ఆఫీసు తాళం పగులగొట్టి ఉందని..దొంగలు పడ్డారనే అనుమానంతో లోపలికి వెళ్లి చూస్తే… కప్​ బోర్డు ధ్వంసం చేసిన దుండ‌గులు ట్రోఫీలు ఎత్తుకెళ్లిన‌ట్లు గుర్తించామ‌న్నారు అధికారులు. కప్​బోర్డులోని ఒక వెండి, 15 ఇత్తడి ట్రోఫీలు మాయం అయినట్లు తెలిపారు. ఈ మేర‌కు అధికారులు సైఫాబాద్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయ‌గా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.