నిజామాబాద్, వెలుగు: జీ రాంజీ స్కీమ్పై కాంగ్రెస్గగ్గోలు పెట్టడడం విడ్డూరంగా ఉందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీపై యుద్ధం చేస్తానని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారని, ఆ పార్టీ పక్కా నాశనమవుతుందని విమర్శించారు. శుక్రవారం బీజేపీ జిల్లా ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్రం ఉపాధి హామీలో అవినీతికి చెక్ పెడుతూ, పనులను125 రోజులకు పెంచిందని పేర్కొన్నారు. స్కీమ్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలిటిక్స్ చేస్తున్నాయని విమర్శించారు. కల్వకుంట్ల కవిత పెట్టే కొత్త పార్టీకి సీఎం రేవంత్రెడ్డి ఫండింగ్ ఉందని ఎంపీ అర్వింద్ఆరోపించారు. మేడంకు పైసలు ఖర్చు పెట్టే గుణం లేదన్నారు.
ఎన్నికలప్పుడే పతంగి ఎగురతదని, ఆ తర్వాత మజ్లిస్కనబడదని కామెంట్చేశారు. నిజామాబాద్పేరును ఇందూరుగా మార్చుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని పేర్కొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్ పాల్గొన్నారు.
