ముంబై: సమీపకాలంలో వెండి ధరలు బంగారం కంటే వేగంగా పెరుగుతాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎంఓఎఫ్ఎస్ఎల్) పేర్కొంది. దీని ప్రకారం గత అక్షయతృతీయ నుంచి గోల్డ్, సిల్వర్ వరుసగా 13శాతం 11శాతం పెరిగాయి.
ఇప్పుడు ధరలు తగ్గితే వీటిని కొనిపెట్టుకోవాలని సూచించింది. దేశీయంగా గోల్డ్ ధర రూ.75 వేలకు, వెండి ధర రూ.లక్షకు చేరవచ్చని అంచనా వేసింది. కమోడిటీ ఎక్స్చేంజ్లోనూ ఈ రెండింటి ధరలు భారీగా పెరుగుతాయని తెలిపింది.