
మాడ్రిడ్: ఈ సీజన్లో తొలి టైటిల్ అందుకునేందుకు ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు రెండు అడుగుల దూరంలో నిలిచింది. స్పెయిన్ మాస్టర్స్ టోర్నమెంట్లో సింధు సెమీఫైనల్ చేరుకోగా.. కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్లోనే ఇంటిదారి పట్టాడు. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్లో రెండో సీడ్ సింధు 21–14, 21–17తో వరుస గేమ్స్లో డెన్మార్క్ ప్లేయర్ మియా బ్లిచ్ఫెల్ట్పై విజయం సాధించింది. మెన్స్ సింగిల్స్లో ఐదో సీడ్ శ్రీకాంత్18–21, 15–21తో టాప్ సీడ్ కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగాడు.