హైదరాబాద్, వెలుగు: సింగపూర్ ఎయిర్లైన్స్ గ్రూప్ హైదరాబాద్ నుంచి తమ దేశానికి విమానాల సంఖ్యను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ నెల నుంచి హైదరాబాద్–-సింగపూర్ సర్వీసులను వారానికి ఏడు నుంచి12కు పెంచుతోంది. ఇందుకు బోయింగ్ 737–-8 విమానాలను వినియోగిస్తామని తెలిపింది.
ఎకానమీలో 144 సీట్లు, బిజినెస్ క్లాస్లో 10 సీట్లు అందుబాటులో ఉంటాయి. రాత్రి సర్వీసులకు ఎయిర్బస్ విమానాలను వాడతామని తెలిపింది. వీటిలో 303 సీట్లు ఉంటాయి. బిజినెస్ క్లాస్లో 40, ఎకానమీలో 263 సీట్లు ఉంటాయని సంస్థ జీఎం సై యెన్ చెన్ చెప్పారు.
ఈ నెల 29 నుంచి 96 వీక్లీ ఫ్లైట్లను హైదరాబాద్ సహా తొమ్మిది నగరాల నుంచి నడుపుతామని వెల్లడించారు. అయితే స్కూట్ విమానాలు ఇక మీదట హైదరాబాద్ నుంచి ఉండవని, ఇతర నగరాలను నుంచి సేవలు అందిస్తాయని అన్నారు.