రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో.. సింగరేణి బెస్ట్​ ఆఫీసర్లు, వర్కర్ల ఎంపిక

 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో.. సింగరేణి బెస్ట్​ ఆఫీసర్లు, వర్కర్ల ఎంపిక

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలు, జైపూర్​ సింగరేణి పవర్​ప్లాంట్​పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సింగరేణి ఆఫీసర్లు, ఉద్యోగులను యాజమాన్యం శనివారం ఎంపిక చేసింది. మందమర్రి ఏరియా నుంచి బెస్ట్​ఆఫీసర్​గా అడిషనల్ జనరల్ ​మేనేజర్​(ఈఎం) వై.వెంకట రమణ, ఉత్తమ ఉద్యోగిగా కోల్​కట్టర్​ కార్మికుడు టి.సునీల్​కుమార్​(కేకే-5మైన్),  శ్రీరాంపూర్ ఏరియా బెస్ట్​ఆఫీసర్​గా డీవైఎస్ఈ శ్యాంకుమార్(ఆర్కే-6 మైన్), బెస్ట్​ వర్కర్​గా ఆర్కే-6 గని సీనియర్​అసిస్టెంట్​మహ్మద్​ నజీరుద్దీన్​ను ఎంపిక చేశారు. 

జైపూర్ థర్మల్​ ప్లాంట్(ఎస్టీపీపీ) బెస్ట్​ఆఫీసర్​గా డిప్యూటీ జనరల్​మేనేజర్(ఎంపీఅండ్​ఎస్) కె.రాజేశ్ ​కుమార్, ఉత్తమ ఉద్యోగిగా ఓవర్సీర్​ సి.అజయ్​ కుమార్​(సివిల్)​ను యాజమాన్యం ఎంపిక చేసింది. జూన్​2న కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ ​వీరిని సన్మానించనున్నారు. ఉత్తమ ఉద్యోగులను ఆయా ఏరియాలో పరిధిలో నిర్వహించే వేడుకల్లో జీఎంలు సన్మానిస్తారు.