
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలు, జైపూర్ సింగరేణి పవర్ప్లాంట్పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సింగరేణి ఆఫీసర్లు, ఉద్యోగులను యాజమాన్యం శనివారం ఎంపిక చేసింది. మందమర్రి ఏరియా నుంచి బెస్ట్ఆఫీసర్గా అడిషనల్ జనరల్ మేనేజర్(ఈఎం) వై.వెంకట రమణ, ఉత్తమ ఉద్యోగిగా కోల్కట్టర్ కార్మికుడు టి.సునీల్కుమార్(కేకే-5మైన్), శ్రీరాంపూర్ ఏరియా బెస్ట్ఆఫీసర్గా డీవైఎస్ఈ శ్యాంకుమార్(ఆర్కే-6 మైన్), బెస్ట్ వర్కర్గా ఆర్కే-6 గని సీనియర్అసిస్టెంట్మహ్మద్ నజీరుద్దీన్ను ఎంపిక చేశారు.
జైపూర్ థర్మల్ ప్లాంట్(ఎస్టీపీపీ) బెస్ట్ఆఫీసర్గా డిప్యూటీ జనరల్మేనేజర్(ఎంపీఅండ్ఎస్) కె.రాజేశ్ కుమార్, ఉత్తమ ఉద్యోగిగా ఓవర్సీర్ సి.అజయ్ కుమార్(సివిల్)ను యాజమాన్యం ఎంపిక చేసింది. జూన్2న కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ వీరిని సన్మానించనున్నారు. ఉత్తమ ఉద్యోగులను ఆయా ఏరియాలో పరిధిలో నిర్వహించే వేడుకల్లో జీఎంలు సన్మానిస్తారు.