చిన్నారి హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య

చిన్నారి హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య

హైదరాబాద్: సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రాజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ టూ వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం లభించినట్లు సమాచారం.  ఈ నెల 9న నిందితుడు ఆరేళ్ల పాపను అత్యాచారం చేసి హత్యచేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. రాజు మృతదేహాన్ని స్టేషన్ ఘన్ పూర్ సమీపంలోని నష్కల్ గ్రామ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ పై మృతదేహాన్ని కనుగొన్నారు. రాజు చేతిపై ఉన్న మౌనిక అనే టాటుతో నిందితుడిని రాజుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు రాజు చనిపోయినట్లుగా ధృవీకరిస్తూ తెలంగాణ డీజీపీ ట్వీట్ చేశారు.