గోదావరిఖని, వెలుగు: రక్షణ చర్యలు పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్వీ సూర్యనారాయణ ఆఫీసర్లకు సూచించారు. గురువారం సింగరేణి సంస్థ ఆర్జీ 2 ఏరియాలో ఆయన పర్యటించారు. ఏరియా పరిధిలోని కోల్హ్యాండ్లింగ్ప్లాంట్, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్3 క్వారీని సందర్శించారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, కోల్ ట్రాన్స్పోర్టు పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఏరియా జీఎం బి.వెంకటయ్య, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉదయ్హరిజన్, షిప్ట్ ఇన్చార్జి శ్రీనివాస్ ఉన్నారు.
ఆర్జీ 1 ఏరియాలోని ఓపెన్కాస్ట్5 ప్రాజెక్ట్ను ప్రాజెక్ట్అండ్ప్లానింగ్జీఎం జి.దేవేందర్సందర్శించారు. ప్రాజెక్ట్ క్వారీలోని పనిస్థలాలను తనిఖీ చేశారు. క్వారీలో బొగ్గు మండకుండా తీసుకుంటున్న చర్యలను పరిశీలించి తగు సూచనలు చేశారు. జీఎం వెంట ప్రాజెక్ట్ ఆఫీసర్డి.రమేశ్, అఫిషియేటింగ్ మేనేజర్ శ్రీనివాస్, సీనియర్ సర్వే ఆఫీసర్ చంద్రమౌళి, ప్రాజెక్ట్ఇంజినీర్ పి.రమేశ్ ఉన్నారు.
