కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలోని బురదగూడెం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సింగరేణి ఉద్యోగి అక్కడికక్కడే చనిపోయాడు. పట్టణ ఎస్సై రాజశేఖర్తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి మూడో జోన్ కార్మెల్ హైస్కూల్ ఏరియాకు చెందిన తోట సతీశ్కుమార్(59) కేకే-5 సింగరేణి బొగ్గు గనిలో మ్యాన్వే క్లర్క్గా విధులు నిర్వహిస్తున్నాడు.
పనినిమిత్తం సతీశ్ రాత్రి బురదగూడెం వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా బెల్లంపల్లి నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి డీకొట్టింది. డ్రైవర్ కారును నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదం జరిగిందని, మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
