మారుపేర్ల సమస్యపై జూన్27న చలో కొత్తగూడెం

మారుపేర్ల సమస్యపై జూన్27న చలో కొత్తగూడెం

నస్పూర్, వెలుగు: సింగరేణిలో మారుపేర్ల మార్పుపై యూనియన్లు నిర్లక్ష్యం వహిస్తున్నాయని బాధితులు ఆరోపించారు. మంగళవారం నస్పూర్ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్న తమ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. మారుపేర్ల మార్పుపై ప్రభుత్వాలు హామీలిస్తున్నాయే తప్పా చర్యలు తీసుకోవడం లేదన్నారు. మారుపేర్ల సమస్యపై ప్రచారం కోసమే కార్మిక సంఘాలు వినతి పత్రాలు ఇవ్వడం తప్ప ఏమీ చేయడంలేదని విమర్శించారు.

 తమ సమస్యల పరిష్కారానికి ఈ నెల27 చలో కొత్తగూడెం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మారుపేర్ల బాధితులు అధిక సంఖ్యలో పాల్గొని సక్సెస్​చేయాలని కోరారు. కార్యక్రమంలో శ్రవణ్ గౌడ్, రాజయ్య, సంతోష్, హరీశ్, వెంకటేశ్, శ్రావణ్, సుధాకర్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.