సింగరేణి స్కూల్ స్వర్ణోత్సవాలను సక్సెస్​ చేయాలి : జీఎం జి.దేవేందర్​ 

సింగరేణి స్కూల్ స్వర్ణోత్సవాలను సక్సెస్​ చేయాలి : జీఎం జి.దేవేందర్​ 

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రిలో సింగరేణి హైస్కూల్​స్థాపించి,50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్​12న స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జీఎం జి.దేవేందర్​ తెలిపారు. ఈ ఉత్సవాలను సక్సెస్​చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం స్కూల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్సవాల లోగోను సింగరేణి ఎడ్యుకేషన్ ​సొసైటీ సెక్రటరీ శ్రీనివాస్​తో కలిసి ఆవిష్కరించారు. 1975 జూన్12న మందమర్రిలో సింగరేణి ఎయిడెడ్ ఉన్నత పాఠశాలను ప్రారంభించారన్నారు. ఈ 50 ఏళ్ల కాలంలో 40 వేల మందికి పైగా విద్యార్థులు ఇక్కడ చదువుకున్నట్లు పేర్కొన్నారు.  పాఠశాల కరస్పాటెండెంట్, ఏరియా పర్సనల్​ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్​ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

మందమర్రి ఏరియా సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జీఎం దేవేందర్ హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో  ఏఐటీయూసీ నాయకులతో 6వ స్ట్రక్చర్డ్​ మీటింగ్ నిర్వహించారు. బొగ్గు గనులు, కార్మిక వాడల్లో నెలకొన్న సమస్యలను ప్రస్తావించగా పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను జీఎం ఆదేశించారు. ఏఐటీయూసీ మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి  బ్రాంచ్​ల సెక్రటరీలు సత్యనారాయణ, అక్బర్​అలీ, మల్లేశ్ తదితరులున్నారు.