
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రిలో సింగరేణి హైస్కూల్స్థాపించి,50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్12న స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జీఎం జి.దేవేందర్ తెలిపారు. ఈ ఉత్సవాలను సక్సెస్చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్సవాల లోగోను సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ శ్రీనివాస్తో కలిసి ఆవిష్కరించారు. 1975 జూన్12న మందమర్రిలో సింగరేణి ఎయిడెడ్ ఉన్నత పాఠశాలను ప్రారంభించారన్నారు. ఈ 50 ఏళ్ల కాలంలో 40 వేల మందికి పైగా విద్యార్థులు ఇక్కడ చదువుకున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల కరస్పాటెండెంట్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
మందమర్రి ఏరియా సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జీఎం దేవేందర్ హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏఐటీయూసీ నాయకులతో 6వ స్ట్రక్చర్డ్ మీటింగ్ నిర్వహించారు. బొగ్గు గనులు, కార్మిక వాడల్లో నెలకొన్న సమస్యలను ప్రస్తావించగా పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను జీఎం ఆదేశించారు. ఏఐటీయూసీ మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి బ్రాంచ్ల సెక్రటరీలు సత్యనారాయణ, అక్బర్అలీ, మల్లేశ్ తదితరులున్నారు.